సమాచారం మేరకు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు దానిని బంధించి తీసుకెళ్లారు. ఆ తరువాత ఇలాంటి అరుదైన సరీసృపాలు రాష్ట్ర రక్షణలో ఉన్నందున.. దీనిని పట్టించి ఇచ్చినందుకు గానూ.. పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అటవీ అధికారులు జార్జ్కు చెప్పారు. వన్యప్రాణి రక్షణ చట్టం ప్రకారం ఇలాంటి కొండచిలువకు అత్యంత రక్షిత హోదా కల్పించబడింది. కాగా, పరిహారం కోసం జార్జ్ ప్రయత్నం మాత్రం ఫలించలేదు. పరిహారం కోసం అతడు నెలల తరబడి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాడు.
ఎట్టకేలకు స్థానిక మంత్రి ఒకరు నిర్వహించిన జనతా అదాలత్లో దిక్కుతోచని స్థితిలో ఉన్న జార్జ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. తనకు జరిగిన అన్యాయంపై మంత్రి గారి ఎదుట ఎకరువు పెట్టుకున్నాడు. పాము కేరళ ప్రభుత్వానికి చెందినదని, అయితే తాను కోల్పోయిన కోళ్లు తనవేనని చెప్పుకున్నాడు. తనకు పరిహారం చెల్లించాలంటూ ప్రభుత్వంపై జార్జ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మంత్రి జార్జ్ను శాంతింపజేసినప్పటికీ అతనికి పరిహారం అందలేదు. చివరకు కేరళ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాడు. కానీ, అతను కమిషన్ను ఆశ్రయించేలోపుగానే.. అతనికి పరిహారం గురించి అటవీ శాఖ నుండి కాల్ వచ్చింది. రాష్ట్రప్రభుత్వం కొండచిలువ తినేసిన కోళ్లకు రూ.2,000 నష్టపరిహారం మంజూరైంది.
సంతోషంగా ఉన్న జార్జ్ చివరకు ఉపశమనం పొందాడు. అతని ప్రయత్నాలకు ప్రతిఫలం లభించిందని చెప్పాడు. ప్రభుత్వ ఆస్తిగా పరిగణిస్తున్న పాముల నుండి తన కోళ్లఫామ్ను రక్షించుకోవడానికి గట్టి భద్రతా ఏర్పాట్లు చేసుకున్నాడు.
ఏపీ రాజకీయాలపై ఆయన చెప్పిన జ్యోతిష్యం తప్పు కావడంతో వేణుస్వామిని ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు నెటిజన్స్. దాంతో ఇక పై రాజకీయాల గురించి జ్యోతిష్యం చెప్పను అని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు వేణు స్వామి. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి కామెంట్స్ చేశారు వేణుస్వామి. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు డిజాస్టర్ అయినప్పుడు నాకు ఎవ్వరూ దండలేయలేదు అన్నారు. అలాగే కల్కి పై కూడా కామెంట్స్ చేశారు.
బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కు హిట్ అనేది రాదని అన్నారు మరి ఇప్పుడు కల్కి సినిమా హిట్ అయ్యింది ఏమంటారు.? అని ప్రశ్నించగా.. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్ అయ్యాయి.. అప్పుడు నాకు ఎవ్వరూ దండలేసి కిరీటాలు పెట్టలేదు. అలాగే సలార్ సినిమా హిట్ అంటూ ఫ్యాన్స్ తెగ ఎగిరారు. ఆ సినిమా నిజంగా హిట్ అయ్యిందా.? ఆ సినిమాకు 130కోట్లు లాస్ వచ్చింది. ఇప్పుడు కల్కి హిట్ అంటున్నారు. ఆ సినిమాలో హీరో ఎవరు.? ప్రభాస్ ఎంత సేపు కనిపించాడు.? అసలు ఆ సినిమా హిట్టా.? నిర్మాతకు ఎంత డబ్బులు వస్తాయో చూద్దాం.! ప్రభాస్ మిర్చి, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు చేయగలడా.? అలాంటి పరిస్థితి లేదు అని విమర్శలు చేశారు వేణుస్వామి. ఇప్పుడు ఈ కామెంట్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
చంద్రలేఖ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వనిత విజయ్ కుమార్. దేవి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. కోడిరామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. కానీ అనుకోకుండా ఆమె పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. ఆతర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. ఇక బుల్లితెరపై మాత్రం సందడి బాగానే చేసింది.
అయితే ఓ డాన్స్ షోలో ఆమె కంటెస్టెంట్ గా పాల్గొంది ఆ షోలో స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ జడ్జ్ గా వ్యవహరించారు. అయితే ఈ ఇద్దరి మధ్య పెద్ద వాగ్వాదామే జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రమ్యకృష్ణతో జరిగిన గొడవ గురించి మాట్లాడింది వనిత విజయ్ కుమార్. సదరు డాన్స్ షోలో వనిత కాళికా మాత వేషంలో డాన్స్ చేసింది. అయితే మేకప్ బాగుంది కానీ డాన్స్ అంతగా బాలేదు అని రమ్యకృష్ణ కామెంట్ చేశారు. దాంతో వనిత ఆగ్రహం వ్యక్తం చేసింది . జడ్జ్మెంట్ ఇవ్వకుండా మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని చెబుతున్నారంటూ.. వేరేవాళ్లతో పోల్చుతున్నారేంటీ..? అంటూ మండిపడింది. ఆతర్వాత వనిత కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోయింది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. రమ్యకృష్ణ తనకు చిన్నప్పటి నుంచి తెలుసు అని.. ఆమె మంచి నటి అని ప్రశంసించింది.అలాగే ఆమెతో ఎలాంటి గొడవలు లేవని.. కేవలం ఆమె చెప్పిన జడ్జ్మెంట్ నచ్చలేదు అని తెలిపింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఛానల్ ఫాలో అవ్వండి.
కల్కి 2898 ఏడీ జోరు కొనసాగుతోంది. దేశ విదేశాల్లో భారీ వసూళ్లు సాధిస్తోంది. తాజాగా ఈ సినిమా 900 కోట్ల మార్క్ను క్రాస్ చేసినట్టుగా వెల్లడించారు మేకర్స్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకోన్ కీలక పాత్రల్లో నటించారు.
కల్కి ఓ అద్భుతం. జస్ట్ వావ్ అనిపించిందని అన్నారు హీరో మహేష్. నాగ్ అశ్విన్ విజన్కి హ్యాట్సాఫ్ అని అన్నారు సూపర్స్టార్. ప్రతి ఫ్రేమ్ కళాఖండంలా ఉందని అన్నారు. అమితాబ్ స్క్రీన్ ప్రెజెన్స్ కి ఎవరూ సరితూగరని ప్రశంసించారు. కమల్హాసన్ ప్రతి పాత్రకూ జీవం పోస్తారని, ప్రభాస్ సునాయాసంగా నటించారని అన్నారు మహేష్.
తన యాబైవ చిత్రం కోసం ఎంతో రిస్క్ చేశారు హీరోయిన్ అంజలి. ప్రస్తుతం అశోక్ దర్శకత్వంలో ఈగై అనే సినిమాలో నటిస్తున్నారు ఈ బ్యూటీ. ఈ సినిమాలో యాక్షన్ సీన్లో భాగంగా 16 అడుగుల ఎత్తు నుంచి దూకాల్సి ఉండటంతో, డూప్ లేకుండా తానే స్వయంగా ఆ జంప్ చేశారు అంజలి.
బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే మొదలైన షెడ్యూల్ తాజాగా పూర్తయింది. బాలయ్యతో పాటు మిగిలిన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. వారం రోజుల తర్వాత మరో షెడ్యూల్ మొదలుకానుంది. దాదాపు 15 రోజుల పాటు సాగుతుంది.
సలోని త్యాగి పాత్రలో నటించిన బ్యూటీ నేహా సర్గమ్. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగిపోయింది. మీర్జాపూర్ 3 సిరీస్ ద్వారా ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయ్యింది. బీహార్లోని పాట్నాకు చెందిన నేహా.. అసలు పేరు నేహా దూబే. పాట్నాలో చదువు పూర్తయ్యాక తల్లి, చెల్లితో కలిసి ముంబై షిఫ్ట్ అయ్యింది. సినీ పరిశ్రమలో సింగర్ కావాలనుకుంది. ఈ క్రమంలోనే ఇండియన్ ఐడల్ సీజన్ 4లో పాల్గొంది. కానీ అదే సమయంలో గొంతు ఇన్ఫెక్షన్ కారణంగా ఆ షో నుంచి బయటకు వచ్చింది.
ఆ తర్వాత రాజన్ షాహి తన సీరియల్లో నేహాకు పిలిచి మరీ ఆఫర్ ఇచ్చారు. కానీ నేహా తల్లిదండ్రులకు ఆమె నటిగా మారడం ఇష్టం లేదు. అలాంటి పరిస్థితులలో రాజన్ షాహి స్వయంగా నేహా ఇంటికి వచ్చి ఆమె తల్లిదండ్రులను ఒప్పించడంతో చాంద్ చూపా బాదల్ మే సీరియల్ లో నటించింది. ఆ తర్వాత చాలా కాలం బ్రేక్ తీసుకున్న నేహా.. 2012లో రామాయణ్: సబ్కే జీవన్ కా ఆధార్ సీరియల్ లో సీత పాత్రలో నటించింది. ఘుమ్ హై కిసీ కే ప్యార్ మే సీరియల్లో నటించిన నటుడు నీల్ భట్ కూడా రామాయణ్ సీరియల్లో నటించాడు. ఈ సీరియల్ సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో మూడేళ్లు రిలేషన్ షిప్ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు.
నేహా సర్గమ్ పౌరాణిక షోలలోనే ఎక్కువగా నటించింది. రామాయణ్, యశోమతి మైయా, పరమావతార్ శ్రీకృష్ణ వంటి సీరియల్స్ లో నటించింది. ఇక ఇప్పుడు మీర్జాపూర్ 3 ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఛానల్ ఫాలో అవ్వండి.
యాబైకి పైగా చిత్రాల్లో హీరోయిన్గా, విలక్షణ పాత్రల్లో మెప్పించిన నటి అంజలి. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో జీ 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్పై రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్ను తెరకెక్కిస్తున్నారు. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్లో రూపొందుతోన్న ఈ సిరీస్లో 6 ఎపిసోడ్స్ ఉండనున్నాయి. ఈ వెబ్ సిరీస్ జూలై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ను టాలీవుడ్ కింగ్ నాగార్జున విడుదల చేశారు. ట్రైలర్ను గమనిస్తే..
మంచోడు చేసే తప్పేంటో తెలుసా.. చెడ్డోడి చరిత్ర గురించి తెలుసుకోవటం అనే డైలాగ్తో ప్రారంభమైంది. ఓ వైపు పచ్చటి పల్లెటూరు, అక్కడ అంజలి, శ్రీతేజ్, అనన్య నాగళ్ల పాత్రల మధ్య సన్నివేశాలను అందంగా చూపిస్తూనే, పల్లెటూరులో ఊరి పెద్ద, అతని మనుషులు చేసే దురాగతాలను చూపించారు.. అలాంటి పల్లెటూర్లోకి పుష్ప అనే అమ్మాయి వస్తుంది. ఆమె వచ్చిన తర్వాత అక్కడి పరిస్థితులు మారుతాయి. ఇంతకీ పుష్ప అక్కడికెందుకు వచ్చింది.. ఊరి పెద్దతో ఆమెకున్న రిలేషన్ ఏంటి.? అమ్మాయిలను ఆటవస్తువులుగా చూసింది ఎవరు.? ఇలాంటి ఎన్నెన్నో ప్రశ్నలకు సమాధానం బహిష్కరణ సీరీస్.
అంజలి పాత్రను గమనిస్తే.. ఓ వైపు ప్రేమ కురిపిస్తూనే మరో వైపు ఆగ్రహావేశంతో ఊగిపోయే ఆమె పాత్రను చూస్తుంటే అంజలీ పోషించిన పాత్రలోని భావోద్వేగాలు ఎంత లోతుల్లో ఉన్నాయో అర్థమవుతుంది. శ్రీతేజ్, అనన్య నాగళ్ల పాత్రలతో పాటు ఊరి పెద్ద పాత్రలో రవీంద్రన్ విజయ్ను చూడొచ్చు. ప్రశాంతంగా ఉండే ఆ పల్లెటూరుకి అమ్మాయి ఎందుకు వచ్చింది.. ఆమెకు అక్కడ ఎదురైన పరిస్థితులేంటి? ఆమె ఎవరిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది.. ఎందుకు? అనే విషయాలు తెలియాలంటే జూలై 19న జీ5లో స్ట్రీమింగ్ కానున్న ‘బహిష్కరణ’ సిరీస్ చూడాల్సిందే. ట్రైలర్లో ప్రతి విజువల్, ప్రతి మాటా సీరీస్ గురించి లోతుగా ఏదో చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా కట్ చేశారు ట్రైలర్ని. జూలై 19 ఎప్పుడెప్పుడు వస్తుందా? సీరీస్ని ఎంత త్వరగా చూద్దామా అని ఎదురుచూసేవారి సంఖ్య పెరుగుతూ ఉంది.
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 22వ ఓవర్లో ఈ సీన్ చోటు చేసుకుంది. ఈ ఓవర్ని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్వయంగా చేశాడు. కరీబియన్ బ్యాట్స్మెన్ లూయిస్ ఓవర్ రెండో బంతికి డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే, అతను బంతిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు. బంతి అతని బ్యాట్ బయటి అంచుని తీసుకొని రెండవ స్లిప్ వైపు గాలిలోకి వెళ్లడం ప్రారంభించింది.
బంతి సెకండ్ స్లిప్లోకి రావడం చూసి, అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న హ్యారీ బ్రూక్ అద్భుతంగా డైవ్ చేసి మైదానాన్నా తాకబోతున్న సమయంలో ఒంటి చేత్తో పట్టుకున్నాడు. హ్యారీ బ్రూక్ పట్టిన ఈ క్యాచ్ని చూసి బెన్ స్టోక్స్, బ్యాట్స్మెన్, స్టేడియంలో ఉన్న అభిమానులు అందరూ ఆశ్చర్యపోయారు. హ్యారీ బ్రూక్ ఈ క్యాచ్ వీడియోను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తన అధికారిక X ఖాతా నుంచి షేర్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.