Showing posts with label 2024. Show all posts
Showing posts with label 2024. Show all posts







 

Viral Video: అరె ఇదేంటి..? తీరానికి కొట్టుకొచ్చిన వింత జీవి..


సముద్రతీరానికి వింత జంతువు కొట్టుకొచ్చింది అంటూ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఆ జీవి రూపం మాత్రం విచిత్రంగా ఉంది. ముఖం ఆవును పోలి ఉంది. కొమ్ములు కూడా ఉన్నాయి. అయితే మిగిలిన శరీరం అంతా డాల్ఫిన్‌లా ఉంది.




నెట్టింట రోజూ రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని ఎడిటెడ్ వీడియోస్ కూడా ఉంటున్నాయి. దీంతో నిజం ఏదో ఫేక్ ఏదో తెలుసుకోవడం కష్టతరంగా మారింది ఈ మధ్య డీప్ ఫేక్ టెక్నాలజీ కూడా అందుబాటులోకి రావడంతో.. కొంచెం కూడా అనుమానం రాకుండా ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేస్తున్నారు నెటజన్లు. తాజాగా సముద్రం తీరానికి ఓ వింత జంతువు కొట్టుకొచ్చింది అన్న వీడియో తెగ వైరల్ అవుతోంది.. అందులో ఓ పెద్ద చేప చూడటానికి డాల్ఫిన్ ఆకారంలో ఉంది. అయితే ముఖం మాత్రం ఆవును పోలి ఉంది. దాని చుట్టూ జనాలు కూడా నిలబడి ఉండటం మీరు చూడవచ్చు. కొంతమంది ఇలాంటి వింత జంతువును తామెప్పుడూ చూడలేదని కామెంట్స్ పెడుతుండగా.. మరికొందరు మాత్రం ఇది పక్కాగా ఫేక్ వీడియో అనేస్తున్నారు. ఇంతకీ ఈ వీడియోపై మీ ఒపినీయన్ ఏంటి…?


 

కోళ్లను మింగిన కొండచిలువ.. రెండేళ్ల తర్వాత రైతుకు పరిహారం ఇచ్చిన ప్రభుత్వం..


తనకు పరిహారం చెల్లించాలంటూ ప్రభుత్వంపై జార్జ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మంత్రి జార్జ్‌ను శాంతింపజేసినప్పటికీ అతనికి పరిహారం అందలేదు. చివరకు కేరళ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాడు. కానీ, అతను కమిషన్‌ను ఆశ్రయించేలోపుగానే.. అతనికి పరిహారం గురించి అటవీ శాఖ నుండి కాల్ వచ్చింది. రాష్ట్రప్రభుత్వం కొండచిలువ తినేసిన కోళ్లకు తగిన నష్టపరిహారం మంజూరైంది.



ఇంటికి సమీపంలోనే చిన్న కోళ్ల ఫామ్‌ నడుపుకుంటున్న రైతు వద్ద కోళ్లు కనిపించకుండా పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అతనికి నష్టపరిహారం అందిచాల్సి వచ్చింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. కేరళలోని కాసర్‌గోడ్‌కు చెందిన కెవి జార్జ్ అనే పౌల్ట్రీ రైతు.. గత కొద్ది రోజులుగా తన ఫామ్‌లో వరుసగా కోళ్ల సంఖ్య తగ్గిపోతూ రావటంతో ఆందోళనకు గురయ్యాడు. కోళ్లను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలిస్తున్నారని మొదట్లో అనుమానించాడు. కానీ, 2022 జూన్‌లో ఓ రోజు ఆ కోళ్ల దొంగను గుర్తించాడు. అది ఎవరో తెలిసి నివ్వెరపోయాడు.. కోళ్లను ఎత్తుకెళ్తున్న దొంగ కొండచిలువ అని తెలిసి భయబ్రాంతులకు గురయ్యాడు. వెంటనే స్థానిక పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు.



సమాచారం మేరకు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు దానిని బంధించి తీసుకెళ్లారు. ఆ తరువాత ఇలాంటి అరుదైన సరీసృపాలు రాష్ట్ర రక్షణలో ఉన్నందున.. దీనిని పట్టించి ఇచ్చినందుకు గానూ.. పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అటవీ అధికారులు జార్జ్‌కు చెప్పారు. వన్యప్రాణి రక్షణ చట్టం ప్రకారం ఇలాంటి కొండచిలువకు అత్యంత రక్షిత హోదా కల్పించబడింది. కాగా, పరిహారం కోసం జార్జ్‌ ప్రయత్నం మాత్రం ఫలించలేదు. పరిహారం కోసం అతడు నెలల తరబడి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాడు.

ఎట్టకేలకు స్థానిక మంత్రి ఒకరు నిర్వహించిన జనతా అదాలత్‌లో దిక్కుతోచని స్థితిలో ఉన్న జార్జ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. తనకు జరిగిన అన్యాయంపై మంత్రి గారి ఎదుట ఎకరువు పెట్టుకున్నాడు. పాము కేరళ ప్రభుత్వానికి చెందినదని, అయితే తాను కోల్పోయిన కోళ్లు తనవేనని చెప్పుకున్నాడు. తనకు పరిహారం చెల్లించాలంటూ ప్రభుత్వంపై జార్జ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మంత్రి జార్జ్‌ను శాంతింపజేసినప్పటికీ అతనికి పరిహారం అందలేదు. చివరకు కేరళ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాడు. కానీ, అతను కమిషన్‌ను ఆశ్రయించేలోపుగానే.. అతనికి పరిహారం గురించి అటవీ శాఖ నుండి కాల్ వచ్చింది. రాష్ట్రప్రభుత్వం కొండచిలువ తినేసిన కోళ్లకు రూ.2,000 నష్టపరిహారం మంజూరైంది.

సంతోషంగా ఉన్న జార్జ్ చివరకు ఉపశమనం పొందాడు. అతని ప్రయత్నాలకు ప్రతిఫలం లభించిందని చెప్పాడు. ప్రభుత్వ ఆస్తిగా పరిగణిస్తున్న పాముల నుండి తన కోళ్లఫామ్‌ను రక్షించుకోవడానికి గట్టి భద్రతా ఏర్పాట్లు చేసుకున్నాడు.

 


గురువుగారూ..! ప్రభాస్ ఫ్యాన్స్‌తో పెట్టుకోకండీ..! కల్కి సినిమా హిట్ కాదంటుంటున్న వేణు స్వామి

సినీ సెలబ్రిటీల విడాకుల గురించి, అనారోగ్య సమస్యల గురించి చేస్తూ పాపులర్ అయ్యారు. ముఖ్యంగా సమంత నాగ చైతన్య జంట విడిపోతారు అని చెప్పి పెద్ద షాక్ ఇచ్చాడు. ఆయన చెప్పినట్టుగానే ఆ జంట విడిపోయారు. ఆతర్వాత కూడా చాలా మంది గురించి రకరకాల కామెంట్స్ చేశాడు. అంతే కాదు స్టార్ హీరోయిన్స్ ఈయనతో ప్రత్యేక పూజలు కూడా చేయించుకున్నారు .




ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి పేరు ఈ మధ్యకాలంలో తెగ వినిపిస్తుంది. ఈ పెద్దాయన సినిమా వాళ్ల జాతకాలు చెప్తూ పాపులర్ అయ్యారు. సినీ సెలబ్రిటీల విడాకుల గురించి, అనారోగ్య సమస్యల గురించి చేస్తూ పాపులర్ అయ్యారు. ముఖ్యంగా సమంత నాగ చైతన్య జంట విడిపోతారు అని చెప్పి పెద్ద షాక్ ఇచ్చాడు. ఆయన చెప్పినట్టుగానే ఆ జంట విడిపోయారు. ఆతర్వాత కూడా చాలా మంది గురించి రకరకాల కామెంట్స్ చేశాడు. అంతే కాదు స్టార్ హీరోయిన్స్ ఈయనతో ప్రత్యేక పూజలు కూడా చేయించుకున్నారు. రష్మిక మందన్న, డింపుల్ హయతిలాంటి హీరోయిన్స్ తో పాటు  అషు రెడ్డి, ఇనాయ సుల్తానాలాంటి మరికొంతమంది బుల్లితెర బ్యూటీస్ కూడా ఆయనతో పూజలు చేయించుకున్నారు. అయితే రీసెంట్ గా ఆయన చెప్పిన జ్యోతిష్యం బెడిసికొట్టింది.




ఇది కూడా చదవండి : Ramya Sri : బీ గ్రేడ్ సినిమాలో చేయమని ఆఫర్ చేశారు.. వాళ్ళందరూ పతివ్రతలు కాదు.. రమ్యశ్రీ బోల్డ్ కామెంట్స్

ఏపీ రాజకీయాలపై ఆయన చెప్పిన జ్యోతిష్యం తప్పు కావడంతో వేణుస్వామిని ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు నెటిజన్స్. దాంతో ఇక పై రాజకీయాల గురించి జ్యోతిష్యం చెప్పను అని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు వేణు స్వామి. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి కామెంట్స్ చేశారు వేణుస్వామి. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు డిజాస్టర్ అయినప్పుడు నాకు ఎవ్వరూ దండలేయలేదు అన్నారు. అలాగే కల్కి పై కూడా కామెంట్స్ చేశారు.

బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కు హిట్ అనేది రాదని అన్నారు మరి ఇప్పుడు కల్కి సినిమా హిట్ అయ్యింది ఏమంటారు.? అని ప్రశ్నించగా.. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్ అయ్యాయి.. అప్పుడు నాకు ఎవ్వరూ దండలేసి కిరీటాలు పెట్టలేదు. అలాగే సలార్ సినిమా హిట్ అంటూ ఫ్యాన్స్ తెగ ఎగిరారు. ఆ సినిమా నిజంగా హిట్ అయ్యిందా.? ఆ సినిమాకు 130కోట్లు లాస్ వచ్చింది. ఇప్పుడు కల్కి హిట్ అంటున్నారు. ఆ సినిమాలో హీరో ఎవరు.? ప్రభాస్ ఎంత సేపు కనిపించాడు.? అసలు ఆ సినిమా హిట్టా.? నిర్మాతకు ఎంత డబ్బులు వస్తాయో చూద్దాం.! ప్రభాస్ మిర్చి, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు చేయగలడా.? అలాంటి పరిస్థితి లేదు అని విమర్శలు చేశారు వేణుస్వామి. ఇప్పుడు ఈ కామెంట్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.


 

Tollywood: ఈ చిన్నారి ఒక్క వాసెలిన్ యాడ్‌తో హీరోయిన్ అయింది.. ఎవరో గుర్తుపట్టగలరా ?

ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి 12వ తరగతిలో టాపర్. అంతేకాదు.. IAS ఆఫీసర్ కావాలనుకుంది. కట్ చేస్తే ఇప్పుడు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో తెలుసా.. ? కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. అలాగే వాణిజ్య ప్రకటనలలోనూ మెరిసింది. ఈ అమ్మాయి చేసిన వాసెలిన్ యాడ్ లో నటించింది.




సాధారణంగా సినీ పరిశ్రమలో చాలా మంది తారలు గమ్యం వేరుగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి తాము నిర్ణయించుకున్న లక్ష్యాలను కాకుండా మరోదారిని ఎంచుకున్నట్లు చెబుతారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోయిన్స్ తాము ఎప్పుడూ నటిగా మారాలని అనుకోలేదని.. కానీ అనుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టామని అంటారు. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి 12వ తరగతిలో టాపర్. అంతేకాదు.. IAS ఆఫీసర్ కావాలనుకుంది. కట్ చేస్తే ఇప్పుడు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో తెలుసా.. ? కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. అలాగే వాణిజ్య ప్రకటనలలోనూ మెరిసింది. ఈ అమ్మాయి చేసిన వాసెలిన్ యాడ్ లో నటించింది. ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తుంది. తనే హీరోయిన్ రాశీ ఖన్నా.


తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు రాశీ ఖన్నా. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రాశీఖన్నా.. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల హృదయాలు దోచేసింది. అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోస్ సరసన అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ ఈ బ్యూటీకి స్టార్ హీరోల మూవీలో అవకాశాలు మాత్రం రాలేదు. తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో మెరిసిన ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారింది. ఇటీవలే సిద్ధార్థ్ మల్హోత్రా సరసన యోధ సినిమాలో కనిపించింది.




నిజానికి రాశీ ఖన్నా తన సినీ ప్రయాణాన్ని హిందీ సినిమాతోనే ప్రారంభించింది. జాన్ అబ్రహం నటించిన మద్రాస్ కేఫ్ సినిమాతోనే నటిగా పరిచయమైంది. ఈ మూవీలో రాశీ ఖన్నా పోషించిన పాత్ర చాలా చిన్నది. ఆ తర్వాత ఈ బ్యూటీకి తెలుగు, తమిళంలో భాషలలో వరుస ఆఫర్స్ వచ్చాయి. ఇక ఇటీవలే అరణ్మనై 4 చిత్రంలో నటించింది. ప్రస్తుతం తమిళంలో ది సబర్మతి రిపోర్ట్ మూవీతోపాటు.. తలాఖోన్ మే ఏక్ వంటి చిత్రాల్లో నటిస్తుంది. ఇక తెలుగులో తెలుసు కదా మూవీలో నటిస్తుంది.





 

స్టేజ్ పైనే రచ్చ రచ్చ.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌పై ఫైర్ అయిన కాంట్రవర్సీ లేడీ


ముగ్గురిని పెళ్లి చేసుకొని అందరిని షాక్ కు గురి చేసింది. అంతే కాదు చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. అంతే కాదు ఆమెను తన ఫ్యామిలీ కూడా దూరం పెట్టేసింది. బయటకు వచ్చిన తర్వాత తన తండ్రి పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తనకు రావాల్సిన వాట ఇవ్వకుండా తనకు అన్యాయం చేశాడని ఆరోపించింది వనిత విజయ్ కుమార్. ఈ కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి.



సీనియర్ నటుడు విజయ్ కుమార్ కూతురు వనిత విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది ఈ చిన్నది. చాలా కాంట్రవర్సీల్లో ఇరుక్కుంది వనిత విజయ్ కుమార్. ఏకంగా ముగ్గురిని పెళ్లి చేసుకొని అందరిని షాక్ కు గురి చేసింది. అంతే కాదు చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. అలాగే ఆమెను తన ఫ్యామిలీ కూడా దూరం పెట్టేసింది. బయటకు వచ్చిన తర్వాత తన తండ్రి పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తనకు రావాల్సిన వాట ఇవ్వకుండా తనకు అన్యాయం చేశాడని ఆరోపించింది వనిత విజయ్ కుమార్. ఈ కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. అలాగే ఆమధ్య బిగ్ బాస్ హౌస్ లోనూ పాల్గొంది ఆమె. వీటితోపాటు కొన్ని టీవీ షోల్లోనూ పాల్గొంది. ఇదిలా ఉంటే వనిత విజయ్ కుమార్ ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పై మండిపడింది.




ఇది కూడా చదవండి : Ramya Sri : బీ గ్రేడ్ సినిమాలో చేయమని ఆఫర్ చేశారు.. వాళ్ళందరూ పతివ్రతలు కాదు.. రమ్యశ్రీ బోల్డ్ కామెంట్స్

చంద్రలేఖ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వనిత విజయ్ కుమార్. దేవి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. కోడిరామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. కానీ అనుకోకుండా ఆమె పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. ఆతర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. ఇక బుల్లితెరపై మాత్రం సందడి బాగానే చేసింది.

అయితే ఓ డాన్స్ షోలో ఆమె కంటెస్టెంట్ గా పాల్గొంది ఆ షోలో స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ జడ్జ్ గా వ్యవహరించారు. అయితే ఈ ఇద్దరి మధ్య పెద్ద వాగ్వాదామే జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రమ్యకృష్ణతో జరిగిన గొడవ గురించి మాట్లాడింది వనిత విజయ్ కుమార్. సదరు డాన్స్ షోలో వనిత కాళికా మాత వేషంలో డాన్స్ చేసింది. అయితే మేకప్ బాగుంది కానీ డాన్స్ అంతగా బాలేదు అని రమ్యకృష్ణ కామెంట్ చేశారు. దాంతో వనిత ఆగ్రహం వ్యక్తం చేసింది .  జడ్జ్‌మెంట్ ఇవ్వకుండా మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని చెబుతున్నారంటూ.. వేరేవాళ్లతో పోల్చుతున్నారేంటీ..? అంటూ మండిపడింది. ఆతర్వాత వనిత కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోయింది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. రమ్యకృష్ణ తనకు చిన్నప్పటి నుంచి తెలుసు అని.. ఆమె మంచి నటి అని ప్రశంసించింది.అలాగే ఆమెతో ఎలాంటి గొడవలు లేవని.. కేవలం ఆమె చెప్పిన జడ్జ్‌మెంట్ నచ్చలేదు అని తెలిపింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

 

Watch: టాయిలెట్‌కి వెళ్దామని డోర్ తీయగా.. వామ్మో.. ఒక్కసారిగా మనిషి ఎత్తున

ఇంట్లోకి పాములు రావడం గురించి తరచూగా వింటూనే ఉంటాం. అలాంటి ఘటనే ఇది కూడా. టాయిలెట్‌లో దూరిన పాము బేసిన్‌లో తల పైకెత్తి కూర్చొని ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దృశ్యం ఒక క్షణం నెటిజన్లను షాక్‌కు గురి చేసింది. వామ్మో ఇదేందీరా సామీ అని అందరూ భయపడిపోయేలా చేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.




వానాకాలం మొదలైంది. వర్షాలు, వరదల కారణంగా పాములు, తేళ్లు, ఇతర క్రిమికీటకాలు నీళ్లలో కొట్టుకు వస్తుంటాయి. వెచ్చటి ప్రదేశాలను వెతుక్కుంటూ ఇళ్లలోకి ప్రవేశిస్తుంటాయి. అలా ఇంట్లో దూరిన పాములు తరచూ వంటింట్లో, కోళ్ల గూళ్లు, వాష్‌రూమ్‌లో నక్కి ఉంటుంటాయి. నివాస ప్రాంతాల్లో పాములు కనిపించడం కొత్త కాదు. పాములు ఇంట్లో పార్క్ చేసిన స్కూటర్, బూట్లలో కూడా కూర్చుంటాయి. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి. ఇంట్లోకి పాములు రావడం గురించి తరచూగా వింటూనే ఉంటాం. అలాంటి ఘటనే ఇది కూడా. టాయిలెట్‌లో దూరిన పాము బేసిన్‌లో తల పైకెత్తి కూర్చొని ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దృశ్యం ఒక క్షణం నెటిజన్లను షాక్‌కు గురి చేసింది. వామ్మో ఇదేందీరా సామీ అని అందరూ భయపడిపోయేలా చేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.




అశోక్ కుమార్ (ashokshera94) అనే యూజర్‌ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోని షేర్‌ చేశాడు. ఈ సీన్ చూస్తే.. చిన్నప్పుడు టాయిలెట్‌కి వెళితే పాము ఎట్నుంచి వస్తుందోననే భయపడేవాళ్లం.. ఇప్పుడు ఆ భయం నిజమైంది. వైరల్ వీడియోలో ఒక పెద్ద పాము టాయిలెట్ బేసిన్‌లో తల పైకెత్తి కూర్చున్న భయానక దృశ్యం కనిపించింది. ఇక నుంచి టాయిలెట్‌కి వెళ్లేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ నెటిజన్లు సూచిస్తున్నారు.




 

Career: ఉచిత శిక్షణ, ఉద్యోగ అవకాశం.. నిరుద్యోగులకు సదవకాశం.

అయితే ఈ కోర్సులు డబ్బులతో కూడుకున్న అంశం. కనీసం రూ. 30 వేలు చెల్లిస్తే కానీ నేర్చుకోలేని పరిస్థితి. మరి మంచి ట్యాలెంట్ ఉండి, ఆర్థికంగా ఇబ్బంది పడే వారి పరిస్థితి ఏంటి.? అలాంటి వారి కోసమే డాక్టర్‌ రెడ్డీస్‌ ఆధ్వర్యంలో ఒక మంచి సదవకశాన్ని కల్పిస్తున్నారు. విద్యార్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తూ, ఉద్యోగ కల్పనలో సహకరిస్తున్నారు.



అయితే ఈ కోర్సులు డబ్బులతో కూడుకున్న అంశం. కనీసం రూ. 30 వేలు చెల్లిస్తే కానీ నేర్చుకోలేని పరిస్థితి. మరి మంచి ట్యాలెంట్ ఉండి, ఆర్థికంగా ఇబ్బంది పడే వారి పరిస్థితి ఏంటి.? అలాంటి వారి కోసమే డాక్టర్‌ రెడ్డీస్‌ ఆధ్వర్యంలో ఒక మంచి సదవకశాన్ని కల్పిస్తున్నారు. విద్యార్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తూ, ఉద్యోగ కల్పనలో సహకరిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


డాక్టర్‌ రెడ్డీస్‌ ఆధ్వర్యంలో గ్రో టెక్‌ పేరుతో నైపుణ్య శిక్షణను అందిస్తున్నారు. ఫుల్‌స్టాక్‌ వంటి సాఫ్ట్‌వేర్‌ కోర్సులతో పాటు మరికొన్ని కోర్సులకు సంబంధించి 4 నెలల శిక్షణను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉచిత ఉపాధి శిక్షణ అందించి, ఉపాధి కల్పిస్తున్నారు. ఐటీఐ, డిప్లొమా, బీటెక్‌, బీఎస్సీ, బీసీఏ వంటి కోర్సులు పూర్తి చేసిన వారు శిక్షణ పొందిన వారు అర్హులు. అర్హులైన వారికి ఒక పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి నెలుగు నెలలపాటు సాఫ్ట్‌వేర్‌ కోర్సులతో పాటు సాఫ్ట్‌ స్కిల్స్‌లో శిక్షణ అందిస్తారు. అనంతరం సంబంధిత కంపెనీల్లో ఇంటర్వ్యూలను ఏర్పాటు చేస్తారు. పూర్తి వివరాలు, రిజిస్ట్రేషన్‌ కోసం  ఇక్కడ క్లిక్‌ చేయండి.



వీటితో పాటు గ్రీన్‌ జాబ్స్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఎలక్ట్రిక్‌ వెహికిల్ సర్వీస్‌ కోర్సులో శిక్షణ అందిస్తున్నారు. ఇందులో శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్స్‌ అందిస్తారు. అలాగే సోలార్‌ ప్లాంట్‌ ఇన్‌స్టాలేషన్‌ కోర్సును సైతం అందిస్తున్నారు. డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 100 కేంద్రాల ద్వారా ఈ శిక్షణ కార్యక్రమాన్ని అందిస్తున్నారు. మరెందుకు ఆలస్యం మీరు కూడా వెంటనే రిజిస్టర్‌ చేయించుకొని మీ ఉద్యోగ అవకాశానికి మార్గం సుగుమం చేసుకోండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఛానల్ ఫాలో అవ్వండి.



 

Film News: బాక్స్ ఆఫీస్ కి చుక్కలు చూపిస్తున్న కల్కి.. మహేష్ ప్రశంస..


కల్కి 2898 ఏడీ జోరు కొనసాగుతోంది. దేశ విదేశాల్లో భారీ వసూళ్లు సాధిస్తోంది. కల్కి ఓ అద్భుతం. జస్ట్ వావ్‌ అనిపించిందని అన్నారు హీరో మహేష్‌.  గత కొన్ని రోజులుగా తనపై జరుగుతున్న ప్రచారం వల్ల తాను తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నానని అన్నారు నటి హేమ. యంగ్ హీరో మంచు మనోజ్ తన కూతురి పేరును ప్రకటించారు.  తన యాబైవ చిత్రం కోసం ఎంతో రిస్క్ చేశారు హీరోయిన్ అంజలి.


కల్కి 2898 ఏడీ జోరు కొనసాగుతోంది. దేశ విదేశాల్లో భారీ వసూళ్లు సాధిస్తోంది. తాజాగా ఈ సినిమా 900 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసినట్టుగా వెల్లడించారు మేకర్స్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపిక పదుకోన్ కీలక పాత్రల్లో నటించారు.





1 / 3




కల్కి ఓ అద్భుతం. జస్ట్ వావ్‌ అనిపించిందని అన్నారు హీరో మహేష్‌. నాగ్‌ అశ్విన్‌ విజన్‌కి హ్యాట్సాఫ్ అని అన్నారు సూపర్‌స్టార్‌. ప్రతి ఫ్రేమ్‌ కళాఖండంలా ఉందని అన్నారు. అమితాబ్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్ కి ఎవరూ సరితూగరని ప్రశంసించారు. కమల్‌హాసన్‌ ప్రతి పాత్రకూ జీవం పోస్తారని, ప్రభాస్‌ సునాయాసంగా నటించారని అన్నారు మహేష్‌.




2 / 3




తన యాబైవ చిత్రం కోసం ఎంతో రిస్క్ చేశారు హీరోయిన్ అంజలి. ప్రస్తుతం అశోక్ దర్శకత్వంలో ఈగై అనే సినిమాలో నటిస్తున్నారు ఈ బ్యూటీ. ఈ సినిమాలో యాక్షన్‌ సీన్‌లో భాగంగా 16 అడుగుల ఎత్తు నుంచి దూకాల్సి ఉండటంతో, డూప్‌ లేకుండా తానే స్వయంగా ఆ జంప్ చేశారు అంజలి.


3 / 3



 


Movie Updates: బులెట్ స్పీడ్ లో బాలయ్య.. వేట్టయాన్‌ కోసం ఫాహద్‌ ఫాజిల్‌..



బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. రామ్‌చరణ్ పవర్‌హౌస్‌లాంటి వ్యక్తి అని అన్నారు శంకర్‌. రవి సిరోర్‌, నివిష్క పాటిల్‌ జంటగా నటించిన సినిమా 'ఎవరు ఎందుకు'. అల్లరి నరేష్‌ హీరోగా నటించిన సినిమా బచ్చలమల్లి. రజనీకాంత్‌, అమితాబ్‌, రానా, మంజువారియర్‌, ఫాహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రల్లో నటించిన సినిమా వేట్టయాన్‌.


బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే మొదలైన షెడ్యూల్‌ తాజాగా పూర్తయింది. బాలయ్యతో పాటు మిగిలిన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. వారం రోజుల తర్వాత మరో షెడ్యూల్‌ మొదలుకానుంది. దాదాపు 15 రోజుల పాటు సాగుతుంది.




1 / 4



రామ్‌చరణ్ పవర్‌హౌస్‌లాంటి వ్యక్తి అని అన్నారు శంకర్‌. ఆయనలోని కంట్రోల్డ్ పవర్‌ని గేమ్‌ చేంజర్‌లో చూడొచ్చని చెప్పారు. చరణ్‌ పార్టు చిత్రీకరణ పూర్తయిందని అన్నారు. చరణ్‌లాంటి హీరోతో పనిచేయడం ఆనందంగా ఉందని అన్నారు శంకర్‌. భారతీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్లో ఈ విషయాలను చెప్పారు.




2 / 4




అల్లరి నరేష్‌ హీరోగా నటించిన సినిమా బచ్చలమల్లి. రాజేష్‌ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా నిర్మించారు. అమృత అయ్యర్‌ నాయిక. ఈ సినిమా షూటింగ్‌ ముగింపు దశలో ఉంది. తాజాగా డబ్బింగ్‌ పనులకు శ్రీకారం చుట్టింది టీమ్‌. రా అండ్‌ రస్టిక్‌ కథాంశంతో తెరకెక్కుతున్నట్టు చెప్పారు మేకర్స్.




3 / 4




రజనీకాంత్‌, అమితాబ్‌, రానా, మంజువారియర్‌, ఫాహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రల్లో నటించిన సినిమా వేట్టయాన్‌. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. తాజాగా ఫాహద్‌ ఫాజిల్‌ తన కేరక్టర్‌కి డబ్బింగ్‌ చెప్పడం మొదలుపెట్టారు. అక్టోబర్‌ 10న విడుదల కానుంది వేట్టయాన్‌. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కెరీర్లో మరో రేంజ్‌ సినిమా అవుతుందని అన్నారు మేకర్స్.

4 / 4




 

Mirzapur 3: మీర్జాపూర్ 3లో రెచ్చిపోయిన సలోని భాబీ ఎవరో తెలుసా.. ? కుర్రాళ్ల హృదయాలను దొచేసిన నేహా..


ప్రస్తుతం ఓ సినీతార గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ఈ ఒక్క సిరీస్ ద్వారా ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఈ బ్యూటీ పేరు మారుమోగుతుంది. ఇక ఇప్పుడు ఈ తారకు ఇన్ స్టా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా..? మీర్జాపూర్ వెబ్ సిరీస్ సీజన్ 3లో దద్దా త్యాగి కోడలు సలోని త్యాగి పాత్రలో నటించిన నేహా సర్గమ్. ఈ సిరీస్ లో దద్దా త్యాగి పెద్ద కొడుకు భరత్ త్యాగి భార్యగా కనిపించింది.




మీర్జాపూర్ 3 వెబ్ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతుంది. ఈ సిరీస్ ద్వారా ఇప్పటివరకు చాలా మంది సినీతారలకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమలో అడుగుపెడుతున్న తారలకు పాపులారిటీని తీసుకువచ్చింది మీర్జాపూర్ సిరీస్. ఈక్రమంలోనే ప్రస్తుతం ఓ సినీతార గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ఈ ఒక్క సిరీస్ ద్వారా ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఈ బ్యూటీ పేరు మారుమోగుతుంది. ఇక ఇప్పుడు ఈ తారకు ఇన్ స్టా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా..? మీర్జాపూర్ వెబ్ సిరీస్ సీజన్ 3లో దద్దా త్యాగి కోడలు సలోని త్యాగి పాత్రలో నటించిన నేహా సర్గమ్. ఈ సిరీస్ లో దద్దా త్యాగి పెద్ద కొడుకు భరత్ త్యాగి భార్యగా కనిపించింది.


సలోని త్యాగి పాత్రలో నటించిన బ్యూటీ నేహా సర్గమ్. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగిపోయింది. మీర్జాపూర్ 3 సిరీస్ ద్వారా ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయ్యింది. బీహార్‌లోని పాట్నాకు చెందిన నేహా.. అసలు పేరు నేహా దూబే. పాట్నాలో చదువు పూర్తయ్యాక తల్లి, చెల్లితో కలిసి ముంబై షిఫ్ట్ అయ్యింది. సినీ పరిశ్రమలో సింగర్ కావాలనుకుంది. ఈ క్రమంలోనే ఇండియన్ ఐడల్ సీజన్ 4లో పాల్గొంది. కానీ అదే సమయంలో గొంతు ఇన్ఫెక్షన్ కారణంగా ఆ షో నుంచి బయటకు వచ్చింది.

ఆ తర్వాత రాజన్ షాహి తన సీరియల్లో నేహాకు పిలిచి మరీ ఆఫర్ ఇచ్చారు. కానీ నేహా తల్లిదండ్రులకు ఆమె నటిగా మారడం ఇష్టం లేదు. అలాంటి పరిస్థితులలో రాజన్ షాహి స్వయంగా నేహా ఇంటికి వచ్చి ఆమె తల్లిదండ్రులను ఒప్పించడంతో చాంద్ చూపా బాదల్ మే సీరియల్ లో నటించింది. ఆ తర్వాత చాలా కాలం బ్రేక్ తీసుకున్న నేహా.. 2012లో రామాయణ్: సబ్కే జీవన్ కా ఆధార్ సీరియల్ లో సీత పాత్రలో నటించింది. ఘుమ్ హై కిసీ కే ప్యార్ మే సీరియల్లో నటించిన నటుడు నీల్ భట్ కూడా రామాయణ్ సీరియల్లో నటించాడు. ఈ సీరియల్ సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో మూడేళ్లు రిలేషన్ షిప్ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు.

నేహా సర్గమ్ పౌరాణిక షోలలోనే ఎక్కువగా నటించింది. రామాయణ్, యశోమతి మైయా, పరమావతార్ శ్రీకృష్ణ వంటి సీరియల్స్ లో నటించింది. ఇక ఇప్పుడు మీర్జాపూర్ 3 ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది.


మరిన్ని సినిమా వార్తల కోసం ఛానల్ ఫాలో అవ్వండి.


 

Bahishkarana Trailer: అమ్మబాబోయ్..! అంజలి అదరగొట్టేసింది.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న బహిష్కరణ ట్రైలర్:


మంచోడు చేసే త‌ప్పేంటో తెలుసా.. చెడ్డోడి చ‌రిత్ర గురించి తెలుసుకోవ‌టం అనే డైలాగ్‌తో ప్రారంభ‌మైంది. ఓ వైపు ప‌చ్చ‌టి ప‌ల్లెటూరు, అక్క‌డ అంజ‌లి, శ్రీతేజ్‌, అన‌న్య నాగ‌ళ్ల పాత్రల మ‌ధ్య స‌న్నివేశాల‌ను అందంగా చూపిస్తూనే, ప‌ల్లెటూరులో ఊరి పెద్ద‌, అత‌ని మ‌నుషులు చేసే దురాగ‌తాల‌ను చూపించారు.. అలాంటి ప‌ల్లెటూర్లోకి పుష్ప అనే అమ్మాయి వ‌స్తుంది.




యాబైకి పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా, విలక్షణ పాత్రల్లో మెప్పించిన నటి అంజలి. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో జీ 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌లో రూపొందుతోన్న ఈ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉండనున్నాయి. ఈ వెబ్ సిరీస్ జూలై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైల‌ర్‌ను టాలీవుడ్ కింగ్ నాగార్జున విడుద‌ల చేశారు. ట్రైల‌ర్‌ను గమనిస్తే..

మంచోడు చేసే త‌ప్పేంటో తెలుసా.. చెడ్డోడి చ‌రిత్ర గురించి తెలుసుకోవ‌టం అనే డైలాగ్‌తో ప్రారంభ‌మైంది. ఓ వైపు ప‌చ్చ‌టి ప‌ల్లెటూరు, అక్క‌డ అంజ‌లి, శ్రీతేజ్‌, అన‌న్య నాగ‌ళ్ల పాత్రల మ‌ధ్య స‌న్నివేశాల‌ను అందంగా చూపిస్తూనే, ప‌ల్లెటూరులో ఊరి పెద్ద‌, అత‌ని మ‌నుషులు చేసే దురాగ‌తాల‌ను చూపించారు.. అలాంటి ప‌ల్లెటూర్లోకి పుష్ప అనే అమ్మాయి వ‌స్తుంది. ఆమె వ‌చ్చిన త‌ర్వాత అక్క‌డి పరిస్థితులు మారుతాయి. ఇంత‌కీ పుష్ప అక్క‌డికెందుకు వ‌చ్చింది.. ఊరి పెద్ద‌తో ఆమెకున్న రిలేష‌న్ ఏంటి.? అమ్మాయిల‌ను ఆట‌వ‌స్తువులుగా చూసింది ఎవ‌రు.? ఇలాంటి ఎన్నెన్నో ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం బ‌హిష్క‌ర‌ణ సీరీస్‌.

అంజ‌లి పాత్ర‌ను గ‌మనిస్తే.. ఓ వైపు ప్రేమ కురిపిస్తూనే మ‌రో వైపు ఆగ్ర‌హావేశంతో ఊగిపోయే ఆమె పాత్ర‌ను చూస్తుంటే అంజలీ పోషించిన పాత్ర‌లోని భావోద్వేగాలు ఎంత లోతుల్లో ఉన్నాయో అర్థ‌మ‌వుతుంది. శ్రీతేజ్‌, అన‌న్య నాగ‌ళ్ల పాత్ర‌ల‌తో పాటు ఊరి పెద్ద పాత్ర‌లో ర‌వీంద్ర‌న్ విజ‌య్‌ను చూడొచ్చు. ప్ర‌శాంతంగా ఉండే ఆ ప‌ల్లెటూరుకి అమ్మాయి ఎందుకు వ‌చ్చింది.. ఆమెకు అక్క‌డ ఎదురైన ప‌రిస్థితులేంటి? ఆమె ఎవ‌రిపై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌నుకుంది.. ఎందుకు? అనే విష‌యాలు తెలియాలంటే జూలై 19న జీ5లో స్ట్రీమింగ్ కానున్న‌ ‘బహిష్కరణ’ సిరీస్ చూడాల్సిందే. ట్రైల‌ర్‌లో ప్ర‌తి విజువ‌ల్‌, ప్ర‌తి మాటా సీరీస్ గురించి లోతుగా ఏదో చెప్పే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంది. ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా క‌ట్ చేశారు ట్రైల‌ర్‌ని. జూలై 19 ఎప్పుడెప్పుడు వ‌స్తుందా? సీరీస్‌ని ఎంత త్వ‌ర‌గా చూద్దామా అని ఎదురుచూసేవారి సంఖ్య పెరుగుతూ ఉంది.








 

Video: వామ్మో.. డేగ కన్నా పవర్ ఫుల్‌గా ఉన్నావ్‌గా భయ్యా.. క్యాచ్ చూస్తే, కళ్లు బైర్లు కమ్మాల్సిందే..


Harry Brook Viral Catch: ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ (ENG vs WI) ప్రారంభమైంది. లార్డ్స్‌లోని చారిత్రక క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య సిరీస్‌లో తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బౌలింగ్ చేయాలని ఇంగ్లాండ్ జట్టు నిర్ణయించింది. మ్యాచ్ తొలిరోజు టీ సమయానికి ఇంగ్లండ్ జట్టు 1 వికెట్ కోల్పోయి 30 పరుగులు చేసింది.





Harry Brook Viral Catch: ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ (ENG vs WI) ప్రారంభమైంది. లార్డ్స్‌లోని చారిత్రక క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య సిరీస్‌లో తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బౌలింగ్ చేయాలని ఇంగ్లాండ్ జట్టు నిర్ణయించింది. మ్యాచ్ తొలిరోజు టీ సమయానికి ఇంగ్లండ్ జట్టు 1 వికెట్ కోల్పోయి 30 పరుగులు చేసింది. అయితే, అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే, ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ అద్భుత క్యాచ్ పట్టి, అందర్నీ ఆశ్చర్యపరిచాడు.





హ్యారీ బ్రూక్ అద్భుత క్యాచ్..

ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్‌ అద్భుత క్యాచ్‌ అందుకున్నాడు. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 22వ ఓవర్‌లో ఈ సీన్ చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ని ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ స్వయంగా చేశాడు. కరీబియన్ బ్యాట్స్‌మెన్ లూయిస్ ఓవర్ రెండో బంతికి డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే, అతను బంతిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు. బంతి అతని బ్యాట్ బయటి అంచుని తీసుకొని రెండవ స్లిప్ వైపు గాలిలోకి వెళ్లడం ప్రారంభించింది.


బంతి సెకండ్ స్లిప్‌లోకి రావడం చూసి, అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న హ్యారీ బ్రూక్ అద్భుతంగా డైవ్ చేసి మైదానాన్నా తాకబోతున్న సమయంలో ఒంటి చేత్తో పట్టుకున్నాడు. హ్యారీ బ్రూక్ పట్టిన ఈ క్యాచ్‌ని చూసి బెన్ స్టోక్స్, బ్యాట్స్‌మెన్, స్టేడియంలో ఉన్న అభిమానులు అందరూ ఆశ్చర్యపోయారు. హ్యారీ బ్రూక్ ఈ క్యాచ్ వీడియోను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తన అధికారిక X ఖాతా నుంచి షేర్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.